► రెండేళ్లు గడిచినా న్యాయం చేయలేని పరిస్థితి
► టీడీపీ జిల్లా మహానాడులో నాయకుల ఆవేదన
► సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన మాజీ మంత్రి టీజీ
► శ్రీశెలం, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేల గైర్హాజరు
కర్నూలు: పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు. నియోజకవర్గాల పర్యటనకు వెళ్లినప్పుడు పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక ముఖం చాటేయాల్సి వస్తోంది. ఈ విషయంపై ఇన్చార్జి మంత్రి దృష్టి సారించాలి.’ అని మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్రెడ్డి, కె.ఇ.ప్రభాకర్, ఎన్.ఎం.డి.ఫరూక్, శిల్పామోహన్రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బి.సి.జనార్ధన్రెడ్డి, మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి తిక్కారెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అధ్యక్షతన స్థానిక వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ జిల్లా మహానాడు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త, పాత నాయకులు విభేదాలు పక్కనపెట్టి సమష్టిగా పని చేయాలన్నారు. వర్గాలను కాపాడుకునేందుకు బహిరంగంగా తగాదాలకు దిగితే పార్టీకి నష్టం తప్పదన్నారు. పునర్విభజనలో భాగంగా నాయకులందరికీ రాజకీయ అవకాశాలు ఉంటాయన్నారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నియోజకవర్గ ఇన్చార్జీలు మీనాక్షినాయుడు, కె.ఈ.ప్రతాప్, వీరభద్ర గౌడ్, విష్ణువర్దన్రెడ్డి, బి.టి.నాయుడు, పార్టీ పరిశీలకుడు సాంబ శివరావు తదితరులు ప్రసంగించారు. శ్రీశైలం, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, మణిగాంధీ, బి.వి.జయనాగేశ్వరరెడ్డి, ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితరులు మహానాడుకు గైర్హాజరయ్యారు. మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ తన ప్రసంగం ముగియగానే సభ నుంచి నిష్ర్కమించారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు కాసాని గోవర్ధన్రెడ్డి, క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, శివానందరెడ్డి, గడ్డం రామకృష్ణ, బత్తిన వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులో చర్చించి జిల్లా మహానాడుకు పంపిన తీర్మాణాలను సభలో చర్చించి ఆమోదించారు.
కార్యకర్తలకు ముఖం చూపలేం
Published Tue, May 24 2016 10:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement