నరసరావుపేట : రాజీవ్ గృహకల్ప సముదాయంపై టీడీపీ నేతల కన్ను పడింది. అక్కడ నివాసం ఉండని లబ్ధిదారుల ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా మంగళవారం హౌసింగ్ డీఈ పర్యవేక్షణలో డివిజన్ పరిధిలోని ఆరుగురు అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రతి ప్లాటు వద్దకు వెళ్లి వివరాలను సేకరించారు. ఈ సర్వేలో సుమారు 102 ప్లాట్ల యజమానులు చేరకుండా ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
నెల రోజులుగా టీడీపీలో జిల్లా స్థాయి పదవి ఉన్న నరసరావుపేట నాయకుడు ఒకరు గృహకల్ప చుట్టూ తిరిగి హౌసింగ్ అధికారులతో మిలాఖిత్ అయి ఓ ప్రణాళిక రూపొందించారు. దానికి స్థానిక ముఖ్య నేత తనయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఖాళీ ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగి సర్వే పేరుతో హడావిడి చేశారు. ఒక్కో ప్లాట్కు రూ.50 వేల వరకు తీసుకొని తమ అనుయాయులకు వాటిని అప్పజెప్పే పనిని జిల్లాస్థాయి టీడీపీ నాయకుడు తన భుజాలపై వేసుకున్నాడనేప్రచారం జోరుగా సాగుతోంది.
మౌలిక సదుపాయాలు లేకే ప్లాట్లు ఖాళీ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేదల కోసం రాజీవ్ గృహకల్పకు రూపకల్పన చేశారు. 2005లో నరసరావుపేట నగరబాట సందర్భంగా ఆయన పెద్ద చెరువులో 384 ఇళ్ల రాజీవ్ గృహకల్ప సముదాయానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 16 బ్లాకులుగా ఒక్కోదానిలో 24 చొప్పున 394 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. 15 బ్లాకుల్లో 360 ప్లాట్ల నిర్మాణం పూర్తయింది.
వీటిని 2013లో లబ్ధిదారులకు కేటాయించారు. అయితే రోడ్లు, తాగు నీరు, చుట్టూ ప్రహరీ తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొందరు ఇక్కడ నివాసం ఉండటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని లబ్ధిదారులు నివాసం ఉండటం లేదనే సాకుతో ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు ‘సర్వే’ అస్త్రాన్ని ప్రయోగించారు.
అధికారులపై ఆగ్రహం..
సర్వే విషయం తెలుసుకున్న యజమానులు గృహకల్పకు చేరుకున్నారు. ఎందుకు వివరాలు సేకరిస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని నిలదీశారు. దీంతో అధికారులు ఖంగు తిన్నారు. ఎవరెవరు ఏయే ప్లాట్లలో నివాసం ఉంటున్నారో తెలుసుకునేందుకు మాత్రమే సర్వే నిర్వహిస్తున్నామని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. 2011లో జారీ చేసిన జీవో ప్రకారం సర్వే చేస్తున్నామని చెప్పి తతంగాన్ని పూర్తి చేసుకుని వెళ్లారు.
అనుయాయులకు అమ్ముకునేందుకే..
ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప సముదాయ కమిటీ చైర్మన్ సబ్బితి సుధాకర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకొని వారి అనుయాయులకు అమ్ముకునేందుకే అధికారులతో ఈ సర్వే చేయిస్తున్నారని ఆరోపించారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నోసార్లు వేడుకున్నా అధికారులు స్పందించలేదని చెప్పారు. ఇప్పుడు నివాసం ఉండటం లేదనే నెపంతో ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
గృహకల్పపై ‘తమ్ముళ్ల’ కన్ను!
Published Wed, Jun 29 2016 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement