నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు | Sakshi
Sakshi News home page

నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు

Published Sat, Jun 17 2017 9:30 PM

నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు - Sakshi

కర్నూలు :
నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిని సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కర్నూలు జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఖరారు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారు చేశారు.

రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డితో వేర్వేరుగా చంద్రబాబు భేటి అయ్యారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అఖిల ప్రియ ప్రతిపాదించిన పేరునే చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. భూమానాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి.

Advertisement

తప్పక చదవండి

Advertisement