రాష్ట్రపతి అవార్డు అందుకున్న మ«దుసూదన్‌రాజు | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి అవార్డు అందుకున్న మ«దుసూదన్‌రాజు

Published Tue, Sep 6 2016 10:28 PM

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతల మీదుగా అవార్డు అందుకుంటున్న మధుసూదన్‌రాజు

సత్తుపల్లి : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌ హెచ్‌ఎం బి.మధుసూదన్‌రాజు సోమవారం అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో జాతీయస్థాయిలో అత్యంత గౌరవప్రదమైన అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. తోటి ఉపాధ్యాయుల సహకారంతోనే అవార్డుకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. 

Advertisement
Advertisement