అమెరికాలో గల్లంతైన తెలుగు విద్యార్థి మృతదేహం లభ్యం | Sakshi
Sakshi News home page

అమెరికాలో గల్లంతైన తెలుగు విద్యార్థి మృతదేహం లభ్యం

Published Tue, Jun 21 2016 8:10 PM

Telugu student found dead in US

జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా) : అమెరికాలో జరిగిన పడవ ప్రమాదంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన పుట్టా నరేష్ (27) గల్లంతైన విషయం విదితమే. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి మూడు గంటలకు కాలిఫోర్నియాలో అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. పడవలో నుంచి జారిపడిన ప్రదేశానికి 200 మీటర్ల దూరంలోనే లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలోని తానా సభ్యుడు వేమూరి సతీష్.. నరేష్ మృతదేహాన్ని స్వగృహానికి పంపేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. నాలుగు రోజుల్లో స్వగృహానికి రానుందని మృతుడి బంధువు, నల్గొండ జిల్లా దామచర్ల తహసీల్దార్ గణేశ్ 'సాక్షి'కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
 

Advertisement
Advertisement