టీడీపీ-బీజేపీ రెండేళ్ల పాలన-వైఫల్యాలపై పది వామపక్ష పార్టీల సదస్సు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ, టీడీపీ రెండూ ఏరుదాటి తెప్ప తగలేసినట్టు వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటూనే రాష్ట్రంలో మాత్రం హోదా కోసం మొసలి కన్నీరు కారుస్తూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలన-వైఫల్యాలపై పది వామపక్ష పార్టీలు ఆదివారం రాత్రి విజయవాడలో సదస్సు నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు 681 వాగ్దానాలు చేసిన చంద్రబాబు వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు. ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలతో పోలీస్ రాజ్యాన్ని తలపిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు బి.హరనాథ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), ఎం.వెంకటరెడ్డి (ఎంసీపీఐ), బి.ఎస్.అమర్నాథ్ (ఎస్యూసీ), పి.సుందరరామరాజు (ఫార్వర్డ్బ్లాక్) తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకుని రాష్ట్ర ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఏరు దాటి తెప్ప తగలేశారు
Published Mon, Jun 20 2016 8:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement