– ‘పది’ మూల్యాంకన సిబ్బంది నియామకాల్లో అధికారుల ఇష్టారాజ్యం
– విద్యార్థుల జీవితాలతో చెలగాటం
– రేపటి నుంచి మూల్యాంకనం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పరీక్షల నిర్వహణ ఎంత ముఖ్యమో.. వాటి మూల్యాంకనమూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. జవాబుపత్రాలు దిద్దే సమయంలో ఏమాత్రం పొరబాటు చేసినా విద్యార్థులు అన్యాయమవుతారు. జవాబుపత్రాలు దిద్దే విషయంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ల (ఏఈ)ది కీలక పాత్ర.
అలాంటి ఏఈల నియామకాల్లో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు తుంగల్లో తొక్కుతూ ‘అయిన వారికి ఆకుల్లో...కాని వారికి కంచెంలో’ అన్న చందంగా వ్యవహరించింది. వీరి నియామకాల్లో పదో తరగతి బోధనానుభవాన్ని ప్రామాణికంగా తీసుకుకోవాల్సి ఉంది. ఇవి పట్టించుకోని అధికారులు ఇష్టానుసారంగా నియమించారు. ఓవైపు బోధన అనుభవం తక్కువ ఉన్నవారిని నియమిస్తే, మరోవైపు ఏళ్ల తరబడి అనుభవం ఉన్న టీచర్లను పక్కన పెట్టేశారు. ఈనెల 3 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకోసం స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
హెచ్ఎంలు ధ్రువీకరించారంటున్న విద్యాశాఖ
ఆయా సబ్జెక్టుల్లో బో«ధనానుభవం ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించాల్సి ఉంది. వారి ధ్రువీకరణ ఆధారంగానే మూల్యాంకనం విధులకు నియమించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొందరిని యూపీ స్కూళ్లలో పని చేసిన అనుభవాన్ని ›ప్రామాణికంగా తీసుకుని నియమించారు. మరికొందరు కేవలం జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్నా వారిని విస్మరించారు. తామంతా సక్రమంగా చేశామని, హెచ్ఎంలు ఇచ్చిన వివరాల మేరకు నియమించామని అధికారులు చెబుతున్నారు.
– సోదనపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండిట్గా పని చేస్తున్న ఎం.ఎర్రిస్వామికి సంబంధించి ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని డ్యూటీ వేశారు.
– శింగనమల మండలం సలకంచెరువు జెడ్పీహెచ్ఎస్లో హిందీ టీచరుగా పని చేస్తున్న ఫయాజ్కు యూపీ స్కూల్ బోధనను పరిగణలోకి తీసుకుని నియమించారు.
– హిందూపురం మండలం కె.బసవనపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండిట్గా పని చేస్తున్న బి.నరసింహమూర్తికి పదోతరగతి బోధించిన అనుభవం 17 ఏళ్ల నాలుగు నెలల 22 రోజులుంది. హెచ్ఎం ధ్రువీకరించారు. అయినా ఈయనను స్పాట్ విధులకు నియమించలేదు.
– శింగనమల మండలం పెరవళి జెడ్పీహెచ్ఎస్లో గణితం టీచరుగా పని చేస్తున్న ఎన్. పద్మజ ఏపీపీఎస్సీ ద్వారా 1999లో నియామకమైంది. అప్పటి నుంచి పదో తరగతి బోధిస్తోంది. గతేడాది వరకు స్పాట్ విధులకు నియమించారు. కానీ ఈసారి మాత్రం ఆమెను నియమించలేదు.
రాత పూర్వకంగా ఇచ్చినా పట్టించుకోలేదు :
మూల్యాంకనం విధులకు జరిగిన నియామకాలు తప్పులతడకగా ఉన్నాయని నాలుగైదు రోజుల కిందే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టిచుకోలేదని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, జిల్లా అధ్యక్షులు వై. ఆదిశేషయ్య, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు సలీం వాపోయారు. యూపీ స్కూళ్లలో బోధించిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని కొందరిని నియమిస్తే, మరికొందరిని కేవలం పదో తరగతి బోధించినా విస్మరించారని వాపోయారు. డీఈఓ, ఏసీ, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్పొప్పులను సరిదిద్దలేదన్నారు. ప్రతి సంవత్సరం ఇదే తంతు సాగుతోందన్నారు.
అడ్డగోలు నియామకాలు
Published Sat, Apr 1 2017 11:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement