సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టీఎస్ టెట్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. టెట్ షెడ్యూలుకు సంబంధించిన ఫైలుపై పాఠశాల విద్య డెరైక్టర్ జి.కిషన్ గురువారం సంతకం చేశారు. దీంతో ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేసేందుకు టెట్ కమిటీ చర్యలు చేపడుతోంది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 9 వరకు ఫీజుల చెల్లింపునకు షెడ్యూలును ఖరారు చేశారు. 19వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఒక పేపరు రాసినా, రెండు పేపర్లు రాసినా రూ. 200 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ను (http://tstet.cgg.gov.in) ఈ నెల 16 నుంచి అందుబాటులోకి తేనుంది.
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), ఇతర పండిత శిక్షణ కోర్సులను ఇటీవల పూర్తి చేసిన దాదాపు లక్ష మంది అభ్యర్థులతోపాటు గతంలో టెట్ రాసినా అర్హత సాధించని లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్లో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకోనుండటంతో (టెట్ స్కోర్కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది) టెట్ కోసం అభ్యర్థులు ఎదురుచూడక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ ఇప్పటివరకు నాలుగు టెట్లను నిర్వహించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ముందుగానే టెట్ నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఐదో టెట్ (తెలంగాణ రాష్ట్రంలో మొదటి టెట్) నిర్వహణకు ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి మొత్తం ప్రక్రియను 2016 ఫిబ్రవరి 12 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మార్చి లేదా ఏప్రిల్లో డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉంది. సిలబస్, దానికి సంబంధించిన వివరాలతోపాటు అర్హతల వివరాలను ఈ నెల 16న జారీ చేసే నోటిఫికేషన్ సందర్భంగా వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అందుబాటులో ఉంచుతారు.అలాగే సిలబస్కు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల్లోని మార్పుల ఆధారంగానే టెట్ సిలబస్ ఉంటుంది.
19 నుంచి ‘టెట్’ దరఖాస్తుల స్వీకరణ
Published Fri, Nov 13 2015 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement