పులివెందుల : పులివెందుల మండలం కనంపల్లె సమీపంలోని నామాలగుండు వద్ద సోమవారం ఉదయం బాంబు పేలినట్లు వదంతులు వ్యాపించాయి. పట్టణంలోని నగరిగుట్టకు చెందిన టీడీపీ కార్యకర్త మోటు శంకరప్ప(56) తన ప్రత్యర్థులపై కేసు నమోదు చేయడానికి తనపై బాంబు దాడి జరిగినట్లు డ్రామా సృష్టించాడు. పోలీసుల కథనం మేరకు.. శంకరప్ప సోమవారం ఉదయం నామాలగుండు వద్ద ఉన్న శివాలయానికి కార్తీక సోమవారం సందర్భంగా దర్శనానికి వెళ్లాడు. అనంతపురం జిల్లా తలపుల మండలం ఏపిలిపల్లె గ్రామానికి చెందిన తన ప్రత్యర్థులు సంజీవరాయుడు, అతని అనుచరులు తనపై బాంబులు విసిరి వేటకొడవళ్లతో దాడిచేశారని..వారినుంచి తప్పించుకొని బయటపడ్డానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి శంకరప్పను స్థానిక పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. 2012 ఆగస్టు నెలలో తన ప్రత్యర్థి అయిన సంజీవరాయుడు, అతని అనుచరులు భూ తగాద విషయమై తన అల్లున్ని హత్య చేశారని ఆ కేసు మంగళవారం వాయిదా ఉందని ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు తనపై హత్యా యత్నం చేశారని శంకరప్ప తెలిపాడు.
పోలీసు విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు :
పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ ప్రసాద్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కడప నుంచి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను పిలిపించారు. వారు అన్నికోణాలలో పరిశీలించి అక్కడ ఎలాంటి బాంబు దాడి జరగలేదని తెలిపారు. సోమవారం సాయంత్రం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ అన్బురాజన్ విలేకరులతో మాట్లాడుతూ అక్కడ బాంబుపేలినట్లు ఎలాంటి శబ్దం రాలేదని సమీపంలోని స్థానికులు, శివాలయానికి వచ్చిన భక్తులు తెలిపారన్నారు. శంకరప్ప బాంబు పేలినట్లు చెబుతున్న ప్రదేశంలో కాగితంలో సల్ఫర్ను తీసుకొని వచ్చి అగ్గిపుల్లతో వెలిగించినట్లుగా తెలుస్తోందని క్లూస్టీం నిర్ధారించిందన్నారు. అతను తన కుడిచేతికి తానే గాట్లు పెట్టుకొని దాడి చేశారని డ్రామా ఆడినట్లు తెలుస్తోందన్నారు. శంకరప్ప తన ప్రత్యర్థులను ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డాడన్నారు.
పులివెందులలో బాంబు కలకలం
Published Tue, Nov 15 2016 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement