- పాత కక్షలే కారణం
మొగుళ్లపల్లి : పాత కక్షల నేపథ్యంలో మండలంలోని చింతలపల్లి శివారు పాత ఇస్సిపేటకు చెందిన జన్నె యాదగిరి (36) శనివారం సాయంత్రం దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జన్నె గుండయ్య, సమ్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కూమారుడైన యాదగిరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివా రం బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం జమ్మికుంటకు వెళ్లి సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి మంచంలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తలపై పదునైన ఆయుధంతో గాయపర్చాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూమారులు ఉన్నారు. మృ తుని భార్య తన భర్తను పాతకక్షల నేపథ్యం లోనే హత్య చేసినట్లు ఆరోపించింది. హత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.