ఇక ఉపగ్రహాల సాయంతో సాగు | Sakshi
Sakshi News home page

ఇక ఉపగ్రహాల సాయంతో సాగు

Published Thu, Jan 5 2017 3:07 AM

ఇక ఉపగ్రహాల సాయంతో సాగు - Sakshi

తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయాభి వృద్ధి లో ఉపగ్రహాల రిమోట్‌ సెన్సింగ్‌ కీలక పాత్ర పోషించ నుంది. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా వ్యవసాయా న్ని లాభసాటి చేసేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియో గంలోకి రానుంది. ప్రపంచంలో ఏదైనా ప్రాంత సమాచారాన్ని నిర్దిష్టంగా గుర్తించే గ్లోబల్‌ నావిగేషన్  శాటిలైట్‌ సిస్టం (జీఎన్ ఎస్‌ఎస్‌), ఉపగ్రహ ఆధారిత భూ సమాచారం(రిమోట్‌ సెన్సింగ్‌), ఓ ప్రాంతంలోని భూమి స్థితిగతులకు (ప్రాక్సిమల్‌ డేటా) సంబంధించిన సమాచారంతో ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. భూ ఉపరితలంపై పర్యావరణ ప్రభావాన్ని మదింపు చేసేందుకూ ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా రైతులు తమకు అనువైన పంటలు ఏమిటో, భూ సారం ఎంతో, ఒకవేళ పంటలు వేసి ఉంటే వాటి దిగుబడి ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు.
 

Advertisement
Advertisement