7న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ | Sakshi
Sakshi News home page

7న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ

Published Tue, Aug 2 2016 6:19 PM

7న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ - Sakshi

కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివాంజనేయ విగ్రహా ప్రతిష్ట మహోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరాయప్రోలు భద్రశర్మ, శ్రీరామశర్మలు మంగళవారం తెలిపారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెగుండ్ల వెంకటేశ్వర్లు, పుష్పావతి దంపతుల సహకారంతో ఆలయంలో 25 అడుగుల ఎత్తుగల శివాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 
 
 
 
 

Advertisement
Advertisement