కడుపునొప్పి భరించలేక ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Published Thu, Aug 25 2016 12:09 AM

The driver of the tractor suicide unbearable abdominal pain

ఎస్‌ఎస్‌తాడ్వాయి : కడుపునొప్పి భరించలేక ఓ ట్రా క్టర్‌ డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రెడ్డిగూడెంలో మం గళవారం రాత్రి జరిగింది. ఎస్సై కరుణాకర్‌రావు కథ నం ప్రకారం... రెడ్డిగూడెంకు చెందిన గండికోట మహేష్‌(26) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. రెండు,మూడుసార్లు వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నాడు. పని ముగించుకొని ‡ఇంటికి రా గానే రాత్రి సుమారు 9 గంటల సమయంలో తీవ్రంగా కడుపునొప్పి వచ్చిం ది. ఎన్నిసార్లు వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురైన మహేష్‌ బాత్‌రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగి కిందపడిపోయాడు.గమనించిన  భార్య వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement