సిట్ అదుపులో నలుగురు.. | Sakshi
Sakshi News home page

సిట్ అదుపులో నలుగురు..

Published Fri, Aug 12 2016 3:04 AM

The four suspects in the special investigation team control

కరీంనగర్ క్రైం: నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో కరీంనగర్, తిమ్మాపూర్ మండలాలకు చెందిన నలుగురిని సిట్ అదుపులోకి తీసుకుందని, వీరిలో ఇద్దరు నయూమ్ సామాజిక వర్గానికి చెందినవారని సమాచారం. వారిని విచారించగా.. కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల్లో మరో 10 మంది వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో రియల్టర్‌గా అవతారమెత్తి పలు భూముల క్రయవిక్రయాలు జరిపాడని, వీటన్నింటిలో నయీమ్ పేరునే వాడుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అరుుతే నయూమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, సెల్‌ఫోన్‌ను మిత్రుల వద్ద ఉంచి వెళ్లాడని తెలిసింది.

Advertisement
Advertisement