మేయర్ హత్య కేసులో బెయిల్ నిరాకరణ | Sakshi
Sakshi News home page

మేయర్ హత్య కేసులో బెయిల్ నిరాకరణ

Published Thu, Dec 24 2015 2:27 AM

The mayor's refusal to bail in murder case

చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఇద్దరు నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టేసింది. ఈ కేసులో శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడు కాసారం రమేష్, పుంగనూరుకు చెందిన న్యాయవాది వెంకట ఆనంద్‌కుమార్ బెయిల్ మంజూరు చేయాలంటూ చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఇరువురి పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై బుధవారం నిందితుల తరపున న్యాయవాది వాదన, ఏపీపీ శ్రీనాథ్ వాదన విన్న న్యాయమూర్తి యుగంధర్ బెయిల్ ఇవ్వడం కుదరదని ఆదేశాలు జారీ చేశారు.
 
 

Advertisement
Advertisement