ఎంపీ తనయులపై కఠిన చర్యలు తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

ఎంపీ తనయులపై కఠిన చర్యలు తీసుకోవాలి

Published Wed, Apr 26 2017 12:30 AM

ఎంపీ తనయులపై కఠిన చర్యలు తీసుకోవాలి - Sakshi

–బాగేపల్లి టోల్‌ప్లాజా సిబ్బంది డిమాండ్‌
 
చిలమత్తూరు : కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌ ప్లాజాపై సోమవారం దాడి చేసిన హిందూపురం పార్లమెంట్‌ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్‌తో పాటు వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాజా ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు ప్లాజా కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఫీజు అడిగినందుకు దౌర్జన్యం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంపీ కుటుంబ సభ్యులు గతంలోనూ ఇదేతరహాలో దౌర్జన్యాలు చేశారని గుర్తు చేశారు. పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వచ్చిన తమపై దాడి చేయడం దారుణమన్నారు. రూ.3 లక్షల విలువ చేసే కంప్యూటర్లు, అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని తెలిపారు. పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. సమావేశంలో టోల్‌ప్లాజా ఉద్యోగులు నటకాజ్, రామకృష్ణ, సురేష్‌ సింగ్, బైరిశెట్టి, నగేష్, శీనా, నరసింహులు, మంజు, గంగరాజు తదితరులు  పాల్గొన్నారు.
 
25హెచ్‌డిపి502–విలేకరులతో మాట్లాడుతున్న బాగేపల్లి టోల్‌ప్లాజా సిబ్బంది 
 
 

Advertisement
Advertisement