వ్యక్తి పైకి దూసుకెళ్లిన లారీ.. పరిస్థితి విషమం | Sakshi
Sakshi News home page

వ్యక్తి పైకి దూసుకెళ్లిన లారీ.. పరిస్థితి విషమం

Published Mon, May 2 2016 9:45 AM

The person serious injuries in road accident

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల శివారులో లారీ ఓ వ్యక్తి పైకి దూసుకెళ్లిన ఘటనలో అతడి కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. పోరుమామిళ్లకు చెందిన వెంకట నర్సింహారావు (50) రైసు మిల్లు నుంచి తిరిగి వెళుతున్న క్రమంలో లారీ అతడ్ని ఢీకొని రెండు కాళ్లపై నుంచి ముందుకు వెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.

 

Advertisement
Advertisement