గూడూరు : మండలంలోని మట్టెవాడ శివారు కొంగరగిద్దలో జరిగిన యువకుడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. శనివారం రాత్రి కొంగరగిద్దలో ఇరుప ఈశ్వర్ అనే యువకుడు మొక్కజొన్న చేనులో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై మట్టెవాడ, కొంగరగిద్దలో పలు రకాల ప్రచారం జరుగుతుండగా, మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో చంపామని వారు అంగీకరించినట్లు తెలిసింది. ఈ కేసు విషయమై సోమవారం పోలీసులను వివరణ కోరగా యువకుడి హత్య విచారణ ఓ కొలిక్కి వస్తున్నట్లు, పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.
Related news
-
విజయవాడలో విషాదం.. డాక్టర్ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెషలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్ నగర్లోని ఇంట్లో శ్రీనివాస్ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్ బాక్స్లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఒక లెటర్ దొరికింది. దీంతో ఇది సూసైడ్ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్కుమార్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్గా పనిచేస్తూ నవీన్కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
బావిలో మునిగి ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని పిచ్చానత్తం గ్రామానికి చెందిన సురేష్ భార్య పవిత్ర(30). ఈ దంపతులకు కుమారుడు రితిక్(9) కుమార్తె నితికాశ్రీ(7)లున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇంటిలోనే ఉన్నారు. పవిత్ర రోజూ తన పిల్లలను వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి ఈత నేరి్పంచేది. అందులో భాగంగా పవిత్ర ఆదివారం మధ్యాహ్నం పవిత్ర తన పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలోకి వెళ్లి ఈత నేరి్పస్తున్నారు. ఆ సమయంలో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు బావిలో మునిగి పోయారు. ఈ నేపద్యంలో రాత్రి వరకు ముగ్గురూ ఇంటికి రాక పోవడంతో సురేష్ బంధువుల ఇంటిలో గాలించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం వ్యవసాయ బావిలో నితికాశ్రీ, రితిక్ మృత దేహాలుగా కనిపించారు. వీటిపై స్థానికులు ఒడుగత్తూరు అగి్నమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృత దేహాలను బయటకు తీశారు. బావిలో గాలించి పవిత్ర మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్లో మెకానిక్గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ–ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్లోని నాగోల్ క్రాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఎం–ఫార్మసీ చదువుతోంది. తాను నాగజ్యోతిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలోనే సంజయ్ తెలియజేయగా వారు వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ మూడేళ్లుగా వారు ప్రేమలోనే ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో ఆమెను తండ్రి మందలించాడు. ఉగాది పండుగ తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాడు.కలిసి ఉండలేమని భావించి..తమ ప్రేమ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో, ఇకపై తాము కలిసి ఉండలేమని భావించి వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు.సూసైడ్ నోట్ లభ్యం..తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్గా బ్రేక్ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం సమీపంలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ దిగువన శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఏలూరు నగరానికి చెందిన మేడం వినోద్ (32) సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసే పనిచేస్తుంటాడు.వినోద్కు భార్య, కుమారుడు ఉన్నారు. తన వృత్తిలో భాగంగా గుంటూరులో సభకు సౌండ్ సిస్టం అమర్చిన వినోద్ తిరిగి విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో కార్యక్రమానికి సౌండ్ సిస్టంను తీసుకెళ్తున్నారు. ఈ సౌండ్ బాక్స్లను తీసుకుని ఏలూరుకు చెందిన మరో ఏడుగురితో చోడవరానికి ఐషర్ వ్యాన్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం సమీపానికి వచ్చేసరికి హైవేపై ఫ్లైఓవర్ దిగువన జగ్గయ్యపేట నుంచి ఒడిశా రాష్ట్రానికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో పాటు, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు మార్జిన్లోకి వెళ్లింది.అప్పటికే వెనుక ఉన్న ఐషస్ వ్యాన్ అదుపు తప్పి వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ఘటనతో మేడం వినోద్, అతని సహచరుడు దారబోయన ప్రభాకర్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్లో ఉన్న ఏలూరు పట్టణానికి చెందిన మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు ప్రభాకర్కు ఇంకా వివాహం కాలేదు. అదే కారణం.. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. సడన్గా బ్రేక్ వేయడం, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడం, రోడ్డు మార్జిన్లోకి లారీని ఒక్కసారిగా తిప్పేయడంతో వెనుక వస్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని అంటున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్ను క్రమబదీ్ధకరించారు.
Related News by category
-
No Headline
వరంగల్ అర్బన్: ‘కారు కడిగితే రూ.5 వేలు జరిమానా. స్విమ్మింగ్ పూల్స్ వాడితే కఠిన చర్యలు. మోటార్లు పెట్టి నీటిని లాగితే జైలు శిక్ష’ ఇది కర్ణాటకలో పరిస్థితి. అక్కడ తాగునీటి క్యాన్ (20 లీటర్లు) రూ.200 ధర పలుకుతోందట! అలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే నీటిని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. గ్రేటర్ వరంగల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మూడేళ్ల తర్వాత మళ్లీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అదీ గంట కూడా పైపులైన్ల చివరి నల్లాల వరకు అందడం లేదు. జూన్లో వర్షాలు కురవకపోతే దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నగరానికి నీటి కష్టాలు తప్పకపోవచ్చు. ప్రత్యామ్నాయ జలాశయాలు లేక నీటి ఎద్దడి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయమేది? వరంగల్ మహానగర ప్రజలకు ధర్మసాగర్ చెరువు మాత్రమే శరణ్యమైంది. ధర్మసాగర్ జలాశయం సామర్థ్యం 1,500 ఎంసీఎఫ్టీ. ప్రస్తుతం ధర్మసాగర్లో ఉన్న నీరు మరో 80 రోజుల వరకు సరిపోతు ందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు, డెడ్ స్టోరేజీ, నీటి వాడకం తదితర కారణాలతో 60 రో జులే నీరందవచ్చని నిపుణుల అంచనా. లీకేజీలు.. అక్రమ నల్లాలు ప్రస్తుతం మహా నగరానికి రోజూ 6 ఎంసీఎఫ్టీల నీరు అవసరం కాగా.. 5 ఎంసీఎఫ్టీల రా వాటర్ సరఫరా అవుతోంది. ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధి చేసిన నీరు 35 శాతం నీటికి లెక్కలు దొరకడం లేదు. లీకేజీలు, అక్రమ కనెక్షన్లతో నీరు పక్కదారి పడుతోంది. కొన్ని చోట్ల మోటార్లతో నీటిని లాగుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇంజనీర్లు వైఫల్యం చెందుతున్నారనే విమర్శలున్నాయి. దేశాయిపేట ఫిల్టర్బెడ్ -
నీటి ఎద్దడి రాకుండా చూడాలి
దుగ్గొండి : వేసవి పూర్తయ్యే వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అఽధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చాపలబండ, గిర్నిబావి, అడవిరంగాపురం గ్రామాల్లో గురువారం ఆయన తాగునీటి వనరులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని బావుల్లో నీటి లభ్యత, గ్రామానికి కావాల్సిన నీటి అంచనాలను బేరీజు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని పైపులైన్ ద్వారా నీటిని బావిలోకి పోయించాలన్నారు. చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యదర్శులు నిరంతరం గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి మోడెం శ్రీధర్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు వైనాల రాజు, మాడిశెట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి నల్లబెల్లి : గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మండలంలోని నందిగామ గ్రామాన్ని గురువారం ఆమె గురువారం సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. డీపీఓ వెంట మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి వద్ది రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ స్థానం బీజేపీదే.. గీసుకొండ : దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈసారి వరంగల్ ఎంపీ స్థానం బీజేపీకే అని పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంపీ ఎన్నికల మండల కోఆర్డినేటర్ డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మరోమారు మోదీ అధికారంలోకి వస్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అవసరమైన నిధులు మంజూరు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు జాన్విక్రం, నాయకులు కత్తి వెంకన్న, ఆకుల వెంకన్న, మర్రి రాజు, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న చేను దగ్ధం ● మూడు గొర్రెలు సజీవ దహనం ● రూ.2 లక్షల ఆస్తినష్టం నర్సంపేట రూరల్ : అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేను దగ్ధమైన సంఘటన మహేశ్వరం గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన నామాల పరమేశ్వర్కు మహేశ్వరం గ్రామ శివారులోని 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు గాలికి మంటలు చెలరేగడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. మొక్కజొన్న చేనులో మేత మేస్తున్న మూడు గొర్రెలు సైతం సజీవ దహనమయ్యాయి. మొత్తం రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు. -
ఎల్ఈడీ వెలుగులేవి?
నల్లబెల్లి : గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్లతో విద్యుత్ బిల్లులు భారీగా రావడం.. నిర్వహణ కష్టమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా వీధిలైట్లను నిర్వహిస్తామని ముందుకొచ్చిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) గుర్తింపు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు ఎల్ఈడీ లైట్ల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్ల నిర్వహణను సంస్థ గాలికొదిలేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిగించిన లైట్లను మరమ్మతు చేయడం లేదు. పనిచేయని లైట్ స్థానంలో మరో లైట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒప్పందాన్ని విస్మరించిన ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏడాదిన్నర క్రితం గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్ల వెలుగులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా.. 319 గ్రామ పంచాయతీల్లో 56 వేల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. లైట్ల బిగింపుతోపాటు నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను సంస్థ ఏడేళ్లపాటు చూసుకోవాల్సి ఉంది. కానీ, నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ విస్మరించింది. ఫలితంగా సుమారు ఐదు నెలలుగా పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ కాంతులు వెదజల్లుతాయని అనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లైట్ల నిర్వహణ చేపట్టాలని మండలస్థాయి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఎన్నిమార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు సంస్థపై తగు చర్యలు తీసుకొని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో నిర్వహణ బాధ్యతలను విస్మరించిన ఈఈఎస్ఎల్ ఐదు నెలలుగా అంధకారం.. కొరవడిన అధికారుల పర్యవేక్షణ జిల్లాలో 323 గ్రామాలు.. 319 జీపీల్లో 56 వేల లైట్లుసంస్థ పట్టించుకోవడం లేదు.. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో కొన్ని నెలలుగా ఎల్ఈడీ లైట్లు వెలగడంలేదు. మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. గ్రామాల్లో రాత్రి వేళ ఎల్ఈడీ వీధిలైట్లు వెలుగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేపట్టి ఎల్ఈడీ వెలుగులు అందించాలి. – కూచన ప్రకాశ్, మండల పంచాయతీ అధికారి, నల్లబెల్లిచర్యలు తీసుకుంటాం..గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్లు వెలగడం లేదని మా దృష్టికి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. గ్రామాల్లో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా ఎల్ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తాం. – కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి -
సాధారణానికి మించి..!
సాక్షి, వరంగల్ : జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో హైరానా పడుతున్నారు. వారం క్రితం కాస్త చల్లబడిన వాతావరణం గత ఆదివారం నుంచి మళ్లీ వేడెక్కుతోంది. 40.4 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇప్పుడు ఏకంగా 45.1 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతను మించి 8 డిగ్రీ సెల్సియస్ అత్యధికంగా గురువారం నమోదైంది. 2022 మేలో వరంగల్లో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నెలరోజులు మిగిలి ఉండగానే ఆ స్థాయిలో ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో గురువారం ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాజకీయ పార్టీలకు గండం.. ఎండ వేడిమి ధాటికి జనాలు ఉదయం 8 దాటిందంటేనే బయటకు రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం వేళ అవసరమైతేనే తప్ప ఎవరూ రోడ్ల పైకి రావడం లేదు. జిల్లాలో ఖిలా వరంగల్, గీసుకొండ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం మండలాల్లో 45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండగా.. మిగలిన మండలాల్లో 40 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంటిపూట బడులకు వెళ్లి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ సభలకు బదులు ఫంక్షన్హాళ్లలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎండతో పాటు వడగాలుల ధాటికి ఏసీ ఫంక్షన్హాళ్లలోనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండలకు భయపడి వీటికి కూడా చాలా మంది రాకపోవడం గమనార్హం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోని రావాలని, నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. గంటలకొద్దీ ప్రయాణం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ల వివరాలు.. నాలుగు రోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గీసుకొండ మండలం గొర్రెకుంటలో 45.1 డిగ్రీల నమోదు భానుడి ప్రతాపంతో ప్రజల బెంబేలు.. సభలకు బదులు ఫంక్షన్హాళ్లలో రాజకీయ పార్టీల సమావేశాలు అవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారుల సూచనరోజు ప్రాంతం డిగ్రీ సెల్సియస్లలో ఆదివారం ఉర్సుగుట్ట 40.4 సోమవారం ఖిలా వరంగల్ 42.4 మంగళవారం కల్లెడ (పర్వతగిరి) 43.4 బుధవారం రెడ్లవాడ (నెక్కొండ) 43.7 గురువారం గొర్రెకుంట (గీసుకొండ) 45.1 -
అరూరి చిన్న మెదడు చిట్లింది
హసన్పర్తి: అరూరి రమేశ్ చిన్న మెదడు చిట్లిందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సన్నాహక సమావేశం హనుమకొండ హంటర్రోడ్డులోని డీ–కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగింది. సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది ఇతర పార్టీ నాయకులు కావ్యను నాన్లోకల్ అంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో లౌకికవాదం లేకుండా పోతుందని తెలిపారు. పదేళ్ల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ది ఏమీ లేదని, కేవలం దేవుళ్ల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ పదేళ్ల కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేశ్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఓ భూ బకాసురుడని ఆరోపించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ దయాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement