⇒ వర్షాలు లేక డెడ్స్టోరేజీకి చేరిన సాగర్ జలాశయం
⇒ 3.60 లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం
⇒ నీటికోసం ఆయకట్టు రైతుల నిరీక్షణ
⇒ గత ఏడాదితో పోలిస్తే ఈసారి తగ్గిన నీటిమట్టం
⇒ నాగార్జుసాగర్ నిండకపోతే పరిస్థితి ఏంటని దిగులు
⇒ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కర్షకుల్లో ఆందోళన
⇒ ఈనెలలో వర్షాలు కురవకపోతే ఆగస్టుపైనే చివరి ఆశలు
రెండు జిల్లాల్లో ఆయకట్టు 3,60,701 ఎకరాలు
నల్లగొండ జిల్లాలో 1,53,542 ఎకరాలు
సూర్యాపేట జిల్లాలో 2,07,159 ఎకరాలు
సాక్షి, నల్లగొండ : నైరుతి రుతుపవనాలు తొలకరితోనే సరిపెట్టుకున్నాయి. పవనాల అడ్రస్ లేకపోవడంతో ఎగువన వర్షాలు లేక నాగార్జునసాగర్ జలకళ తప్పింది. ఉమ్మడి జిల్లా పంటల సాగుకు కల్పతరువుగా ఉన్న ఈ ప్రాజెక్టు.. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ప్రస్తుత నీటిమట్టం డెడ్స్టోరేజీకి చేరుకుంది. వర్షాలు లేక..జలశయం నిండకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగు బెంగ పట్టుకుంది. నీళ్లు లేకపోతే పంటలను ఎలా సాగుచేయాలని కర్షకుల్లో ఆందోళనవ్యక్తమవుతోంది. సాగర్ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు వరుణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు.. జలాశయం ఎప్పుడునిండుతుందోనని ఆకాశంకేసి ఆశగా ఎదురుచూస్తున్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 3,60,701 ఎకరాల సాగర్ అయకట్టు ఉంది. ఇందులో నల్లగొండ జిల్లాలో 7 మండలాల్లో 1,53,542 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2,07,159 ఎకరాల్లో సాగర్ నీళ్లతో ఏటా ఖరీఫ్లో పంటలు సాగవుతాయి. రెండు జిల్లాల మొత్తం ఆయకట్టులోనే ఎడమకాల్వ ఎత్తిపోతల కింద 81,841ఎకరాలు ఉన్నాయి. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నిండి.. సాగర్కు వరద వస్తేనే ఆయకట్టులో సాగుకు నీటి విడుదల చేస్తారు.
అయితే గత నెలలో నైరుతి రుతుపవనాలు తొలకరితో ఊరించి మళ్లీ వెనకడుగు వేశాయి. దీంతో ఎగువన శ్రీశైలానికి కూడా కృష్ణానది నీటి వరద లేకుండా పోయింది. ఈ పరిస్థితితో శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు చుక్కనీరు కూడా విడుదల చేయడం లేదు. గత ఏడాది ఇదే నెలలో సాగర్లో 506 అడుగుల మేర నీరుంటే.. ఇప్పుడు 501 అడుగులకు చేరాయి. మొత్తంగా సాగర్ నీటిమట్టం డెడ్స్టోరేజీలో ఉంది. నైరుతిరుతు పవనాల కదలికలో మందగమనంతో ఉండడంతో ఈనెలలో వర్షాలు కురస్తాయో..?లేదోనని ఆయకట్టు రైతులు ఆందోళనచెందుతున్నారు.
ఆగస్టుపైనే ఆశలు..
ఈనెలలో వర్షాలు కురవకపోతే ఆయకట్టు రైతులు ఇక వచ్చే ఆగస్టు నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. సాగర్ నీళ్లు ఖరీఫ్కు ఎలాగైనా వస్తాయని విత్తనాలు, ఎరువులు ముందస్తుగా సిద్ధంచేసుకున్నారు. తొలకరి వర్షాలతో నారుమళ్లు, దుక్కులు దున్ని పంట సాగుకు సమాయత్తమయ్యారు. కౌలు రైతులు పంట సాగుకు ముందుగానే అప్పు తెచ్చుకున్నారు. ఒకవేళ వచ్చేనెలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే పంటల సాగు ఎలా అని రైతులు తర్జనభర్జన పడుతున్నారు. ఏటా జూలై నెలలో భారీ వర్షాలు పడితే ఆగస్టు మొదటివారంలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తారు. గత నెలలో భారీ వర్షాలు లేకపోవడం, ఈనెలలో కూడా చిరుజల్లులే పడుతుండడంతో.. రైతులకు పంట సాగు రంది పట్టింది.
510 అడుగులు వస్తేనే..
నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఖరీఫ్లో పంటల సాగుకు నీటిని విడుదల చేయాలంటే జలాశయంలో 510 అడుగులకు పైగా నీరుంటేనే ముందుగా నారుమళ్లకు, ఆ తర్వాత జలాశయం నిండే పరిస్థితులకు అనుగుణంగా వరినాట్లకు నీటిని విడుదల చేస్తారు. గత ఏడాది ఆగస్టులో 510 అడుగులు నీరుండడంతో అప్పట్లో ఇదేనెలలో మొదటివారంలోనే పంటలకు నీటిని విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు 501 అడుగులతో డెడ్స్టోరేజీతోనే ఉండడంతో వర్షాలు ఎప్పుడు వస్తాయి.. సాగర్ ఎప్పుడు నిండుతుందోనని రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
దేవుడి మీదే భారం..
వర్షాకాలం వచ్చి నెల గడిచినా ఇంత వరకు వానల జాడేలేదు. ఖరీఫ్ సాగు కోసం ఇప్పటికే దుక్కులు దున్నుకొని వర్షాల కోసం దేవుడి మీద భారం వేశాం. సాగుకు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశాం. కాలం ఇలాగే ఉంటే పంటలు ఎలా సాగు చేయాలి.
– పోతనబోయిన శ్రీనివాస్యాదవ్, రైతు, త్రిపురారం
వరుణుడు కరుణిస్తేనే..
దుక్కులు దున్ని పొలం సిద్ధం చేశాం. ఇప్పటి వరకు సాగుకు అనుకూలంగా వర్షాలు కురవలేదు. వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. సాగు చేయడానికి ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పెట్టుకున్నాం. వర్షాలు కురవకపోతే వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి లేదు.
– అనుముల వెంకట్రెడ్డి, రైతు, త్రిపురారం
ఎదురుచూపులు
Published Fri, Jul 7 2017 4:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement