బ్రహ్మంగారిమఠం: సోమిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని రవీంద్రనగర్కు చెందిన ఆరో తరగతి విద్యార్థి గణేష్(13)ను దారుణంగా హత్య చేసి, గ్రామ సమీపంలో పడేశారు. ఈ సంఘటన మంగళవారం గొర్రెల కాపరుల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. స్థానిక ఎస్ఐ రంగస్వామి, మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం, డీఎస్పీ రామక్రిష్ణయ్యకు వారు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ తండ్రి రమణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మా గ్రామంలోనే నివాసం ఉంటున్న యానాదులు మా అబ్బాయిని హత్య చేసి ఉంటారని రమణయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బొగ్గులు కాల్చుకునే విషయంలో కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడి ఉంటారని వారు పేర్కొన్నారు. బి.మఠంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతుండే వాడు. ఈ నెల 9న సైకిల్పై పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితులను విచారణ చేశారు. అయినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంత మంది గొర్రెల కాపరులకు చౌదరివారిపల్లె పొలంలో ఆ అబ్బాయి మృతదేహం, సైకిల్, పుస్తకాల బ్యాగు మంగళవారం కనిపించాయి. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్థానిక డీఎస్పీ రామక్రిష్ణయ్య తెలిపారు.
విద్యార్థి దారుణ హత్య
Published Tue, Sep 13 2016 9:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement