విద్యార్థి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

విద్యార్థి దారుణ హత్య

Published Tue, Sep 13 2016 9:04 PM

The Student Bruthal Murder

బ్రహ్మంగారిమఠం:  సోమిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని రవీంద్రనగర్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి గణేష్‌(13)ను దారుణంగా హత్య చేసి, గ్రామ సమీపంలో పడేశారు. ఈ సంఘటన మంగళవారం గొర్రెల కాపరుల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. స్థానిక ఎస్‌ఐ రంగస్వామి, మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం, డీఎస్పీ రామక్రిష్ణయ్యకు వారు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్‌ తండ్రి రమణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మా గ్రామంలోనే నివాసం ఉంటున్న యానాదులు మా అబ్బాయిని హత్య చేసి ఉంటారని రమణయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బొగ్గులు కాల్చుకునే విషయంలో కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడి ఉంటారని వారు పేర్కొన్నారు. బి.మఠంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతుండే వాడు. ఈ నెల 9న సైకిల్‌పై పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితులను విచారణ చేశారు. అయినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంత మంది గొర్రెల కాపరులకు చౌదరివారిపల్లె పొలంలో ఆ అబ్బాయి మృతదేహం, సైకిల్, పుస్తకాల బ్యాగు మంగళవారం కనిపించాయి. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్థానిక డీఎస్పీ రామక్రిష్ణయ్య తెలిపారు.

Advertisement
Advertisement