వరంగల్ సిటీ, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదుల నిరసన కొనసాగుతోంది. ఆయనతోపాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ప్రధానికి లేఖ రాయడంపై... తెలంగాణపై విషం కక్కుతున్నారంటూ ఎంపీ లగడపాటిపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నారుు. ఈ ముగ్గురు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ద్రోహులనే నినాదాలతో ఓరుగల్లు మార్మోగింది. టీజేఏసీ పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా శనివారం ఆ ముగ్గురి దిష్టిబొమ్మలను దహనం చేశారు. జేఏసీ, టీఆర్ఎస్, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగారుు.
సీఎం వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్లో ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఉచిత వైద్యశిబిరం నిర్వహించి రోగులకు వైద్యం అందజేశారు. సంస్థ నిర్వాహకులు పరికిపండ్ల అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నర్మెట మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాప్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని జేఏసీ కన్వీనర్ మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
భూపాలపల్లి మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఘనపురం మండలం కరకపల్లిలోని ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం నిరసనకారులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
లింగాలఘనపురం, వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూర్నాగారం, మంగపేట మండల కేంద్రా ల్లో సీఎం కిరణ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇప్పటికైనా సీఎం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తున్నందున రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరిపెడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సీఎం డౌన్డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం ధ్వనించింది.
వుుఖ్యవుంత్రిని వెంటనే బర్తరఫ్ చేయూలనే డిమాండ్తో నర్సంపేటలో టీబీఎస్ఎఫ్ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
హన్మకొండ బస్టాండ్ సమీపంలో టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని టీ ఎస్జేఏసీ కన్వీనర్ బొల్లపల్లి కిషన్ డిమాండ్ చేశారు.
తెలంగాణపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారంటూ మహబూబాబాద్, నర్సింహులపేటలో తెలంగాణవాదులు నిరసన తెలిపారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు.పద్ధతి మార్చుకోకుంటే తెలంగాణలో టీడీపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు.
ఆ ముగ్గురూ.. ద్రోహులే
Published Sun, Aug 11 2013 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement