సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కోవూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు కింద జరిగిన అక్రమాలపై బుధవారం హైకోర్టులో విచారణ సాగనుంది. నియోజకవర్గంలో రూ.350కోట్ల మేర అవినీతి జరిగిందని కొందరు తెలుగుదేశంపార్టీ నాయకులతో పాటు రైతు నాయకులు రెండు నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఆదేశం మేరకు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు బుధవారం నుంచి విచారణ ప్రారంభించనుంది.
కోవూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు, వరద నష్టం పనులు(ఎఫ్డీఆర్), జాతీయ ఉపాధి హామీ పథకం, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్(ఓఅండ్ఎం) నిధుల కింద భారీ ఎత్తున పనులు చేపట్టారు. శాసనసభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, కొందరు తెలుగుదేశం నాయకులు ఈ పనుల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని పనులను చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి నాయకులు 60 శాతం, అధికారులు, ఉద్యోగులు 40 శాతం నిధులు దిగమింగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
రెండు మూడు పథకాల కింద ఒకే పని
ఒకే పనిని రెండు మూడు పథకాల కింద చేసినట్లు చూపించి నిధులు కొల్లగొట్టారు. సాగునీటి సంఘాల పాలకవర్గాలకు తెలియకుండానే నెల్లూరులో బోగస్ బ్యాంక్ ఖాతాలు తెరచి నీటి సంఘాల ద్వారా పనులు చేసినట్లు నిధులు గోల్మాల్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కోవూరు నియోజకవర్గంలోనే రూ.350 కోట్ల అవినీతి జరిగిందని ఆయకట్టు సంఘాలు, ఆయకట్టు సంఘాల నాయకులు, రైతు ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు, నీటి పారుదలశాఖ ఎస్ఈకి ఫిర్యాదులు ఇచ్చారు. అయితే అధికారులు నామమాత్రపు విచారణలు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా విషయం అటకెక్కించారు.
ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ నాయకులు, రైతు సంఘాల నాయకులు తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన అవినీతి వ్యవహారంపై విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. వివాదం హైకోర్టుకు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు హడావుడిగా కొందరు కిందిస్థాయి ఉద్యోగులను బదిలీ చేసి తాము చర్యలు తీసుకున్నామని చూపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నీరు–చెట్టులో కోవూరు నియోజకవర్గంతో పాటు సర్వేపల్లి, నెల్లూరురూరల్, గూడూరు, సూళ్లూరుపేట, కావలి నియోజకవర్గాల్లో కూడా రెండున్నరేళ్లలో సుమారు రూ.1000 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ అక్రమాలపై మీడియాలో పెద్ద ఎత్తున వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఫిర్యాదుదారులు వీటన్నింటిని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.
నీరు – చెట్టు అక్రమాలపై నేడు హైకోర్టులో విచారణ
Published Wed, Feb 8 2017 11:08 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement