హిందూపురం రూరల్ : పట్టణంలోని ఎస్డీజీఎస్ కళాశాల ఆవరణలో జరుగుతున్న కర్నూలు డివిజన్ స్థాయి తపాలా ఉద్యోగుల క్రీడా పోటీల్లో క్రికెట్ టోర్నీ విజేతగా అనంత అచీవర్స్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అనంత అచీవర్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హిందూపురం హంటర్స్ జట్టు 20 ఓవర్లలో 133 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఉత్తమ బ్యాట్స్మెన్గా రెడ్డప్ప , ఉత్తమ బోలర్గా రామాంజినరెడ్డి, మ్యాన్ ఆప్ది మ్యాచ్కు వెంకటకిషోర్ ఎంపికయ్యారు. బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో హిందూపురం జట్టుపై కర్నూలు జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ ఎండీ ఇస్మాయిల్, అసిస్టెంట్ సూపర్ వైజర్ శ్రీనివాసులు, మున్సిపల్మేనేజర్ నరసింహులు విజేతలకు కప్లను అందజేశారు.