శ్రీపాదరావు విగ్రహానికి నల్లరంగు పూసిన దుండగులు | Sakshi
Sakshi News home page

శ్రీపాదరావు విగ్రహానికి నల్లరంగు పూసిన దుండగులు

Published Sun, May 15 2016 8:53 AM

they painted the statue of Sripada Rao black colour

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మాజీ అసెంబ్లీ స్పీకర్ డి. శ్రీపాదరావు విగ్రహానికి ఆగంతకులు శనివారం అర్థరాత్రి నల్లరంగు పూశారు. ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ శ్రీపాదరావు విగ్రహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను గుర్తించి కఠనంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement