లారీని ఢీకొన్న ఆటో : ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ఆటో : ముగ్గురు మృతి

Published Thu, Nov 5 2015 7:36 AM

Three killed in road accident in west godavari district

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద గురువారం ఆటో - లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

అలాగే మృతదేహలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు ఆటో గుండుగొలను నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వ్యవసాయ కూలీలు రాము, శ్రీను, ప్రభాకర్గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement