తిరుమల:ఎప్పుడూ నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల పరిసర ప్రాంతాల్లో పులి సంచారం ఆందోళన కల్గిస్తోంది. సోమవారం సాయంత్రం తూర్పు బాలాజీ నగర్ లో పులి సంచరించడంతో తీవ్ర కలకలం సృష్టించింది. అకస్మికంగా జనావాసంలోకి పులి రావడంపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వన్యప్రాణుల సంచారంపై త్వరలోనే నివారణ చర్యలు చేపడతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై టీటీడీ కూడా స్పందించింది. స్థానికంగా ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు.