- మహానాడు ముగింపులో సీఎం చంద్రబాబు
- 28 తీర్మానాలు ఆమోదం
సాక్షి, చిత్తూరు: రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది 2029 నాటికి దేశంలో మొదటి స్థానంలో, 2050 నాటికి ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేలా కృషి చేయడమే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సాధించాలంటే అప్పటి వరకు అధికారంలోనే ఉండాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడులో మూడవ రోజు ఆదివారం సాయంత్రం ఆయన ముగింపు సందేశం ఇచ్చారు.
టీడీపీ పాలనపై 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండాలని.. పార్టీ నేతలు, కార్యకర్తలు అవినీతి జోలికెళ్ల వద్దని సూచించారు. రాష్ట్రంలో గత ఏడాది 10.99 శాతం వృద్ధి నమోదైందని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని 15 శాతంగా నిర్ణయించామని చెప్పారు. పని చేసిన వారికే గుర్తింపు లభిస్తుందని మొన్న జరిగిన తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు నిరూపించాయన్నారు. అవినీతి పాలన, తప్పిదాల వల్లనే 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కనుమరుగైందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
పేదరికం లేని సమాజమే ధ్యేయం
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ఎన్టీఆర్ లక్ష్యమని, ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణాలో పార్టీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ఆదాయం లేకున్నా మొండి పట్టుదలతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివిధ పథకాలను ఉదహరించారు.
తుని ఘటన ప్రతిపక్షాల కుట్ర
తుని ఘటన వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కులం, మతం పేరిట ప్రజలను విభజించి ప్రజలు, పెట్టుబడిదారుల్లో అభద్రతాభావం పెంపొందించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనార్టీల కోసం కడప, విజయవాడలో హజ్హౌస్లను నిర్మిస్తున్నామన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ ఖనిజాన్ని టీడీపీయేతర ప్రభుత్వాలు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి యత్నిస్తే అనేక పోరాటాలు చేసి గిరిజన హక్కులను కాపాడామని చెప్పారు. కాగా, మూడు రోజుల మహానాడులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 28 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
2050 వరకు అధికారంలో ఉండాలి
Published Mon, May 30 2016 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement