గురుకుల మహిళా డిగ్రీ ప్రవేశాలకు నేడు కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

గురుకుల మహిళా డిగ్రీ ప్రవేశాలకు నేడు కౌన్సెలింగ్‌

Published Mon, Aug 1 2016 11:50 PM

Today umen gurukul collage counseling

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌): జిల్లాలో 2016–17 విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ కర్త కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తిలలో ఇంగ్లిష్‌ మీడియం గురుకుల డిగ్రీ కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఏలో 94, బీకాంలో 134, బీకాం (ఎంపీసీ) 17 చొప్పున మొత్తం 245 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు, విద్యార్థినులు విద్యార్హతకు సంబంధించిన ఓరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు రాంరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు. ఇదిలాఉండగా, గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులతోపాటు నూతనంగా దరఖాస్తు చేసుకునే వారు కూడా నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement