‘జన హృదయ నేత’కు పిండ ప్రదానం | Sakshi
Sakshi News home page

‘జన హృదయ నేత’కు పిండ ప్రదానం

Published Mon, Aug 22 2016 6:49 PM

‘జన హృదయ నేత’కు పిండ ప్రదానం - Sakshi

సత్రశాల (రెంటచింతల): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి సత్రశాలలో ఆదివారం వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు ఏరువ శౌరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వైఎస్‌ అభిమానులు పుష్కరస్నానం చేయించారు. ఈ సందర్భంగా శౌరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకపాలనకు వైఎస్‌ ఆత్మ క్షోభిస్తుందని, పుష్కరస్నానంతో ఆయన ఆత్మకు నిత్యవిశ్రాంతి కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొంకూరి తిరుపతిరావు, పూసపాటి లక్ష్మయ్య, దుగ్గింపూడి చిన్నపరెడ్డి, ఏరువ రాజారత్నారెడ్డి, కుందురు వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement