రైలులో అనారోగ్యంతో బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

రైలులో అనారోగ్యంతో బాలుడి మృతి

Published Sat, Sep 3 2016 12:26 AM

train anarogyam baludu dead

రైల్వేగేట్‌ : అనారోగ్యంతో రైలు భోగీలో బాలుడు మృతిచెం దిన సంఘటన వరంగల్‌ రైల్వేస్టేçÙన్‌ వద్ద  శుక్రవారం ఉదయం జరిగింది. బాలుడి తల్లిదండ్రులు, సత్యనారాయణ, అన్నపూర్ణతోపాటు స్టేషన్‌లోని రైలు ప్రయాణికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంనకు చెందిన ఆరో తరగతి విద్యార్థి తిరుపతి దుర్గాప్రసాద్‌(11) గత తొమ్మిది నెలలుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. బాలుడిని హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌లో చూపించేందుకు శుక్రవారం గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో తీసుకొస్తుండగా రైలు తెల్లవారుజామున వరంగల్‌ జిల్లా నెక్కొండకు వచ్చేసరికి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. అతడిని రైలులో వరంగల్‌ స్టేషన్‌ వరకు తీసుకొచ్చి అక్కడ దింపిన తర్వాత రైల్వేస్టేçÙన్‌ నుంచి పశ్చిమ గోదావరిలోని చాగల్లు మండలంలోని బ్రాహ్మణగూడెం గ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. 

Advertisement
Advertisement