రైలు కిందపడి అసిస్టెంట్‌ స్టేషన్‌ మేనేజర్‌ మృతి | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి అసిస్టెంట్‌ స్టేషన్‌ మేనేజర్‌ మృతి

Published Fri, Nov 11 2016 12:24 AM

రైలు కిందపడి అసిస్టెంట్‌ స్టేషన్‌ మేనేజర్‌ మృతి

కడప అర్బన్‌ : కడప నగరం సియోనుపురంలో నివసిస్తూ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ స్టేషన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు గురువారం కన్యకుమారి ఎక్స్‌ప్రెస్‌ వచ్చిన సమయంలో ప్లాట్‌ఫాం పైనుంచి జారి కిందపడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. రెండు కాళ్లకు తీవ్ర గాయాలై రక్తస్రావం అధికంగా జరిగింది.  108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. ఆర్‌ఎంఓ వెంకటశివ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు తమవంతు వైద్య సేవలను అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. రైల్వే ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డికి మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.

Advertisement
Advertisement