చెట్లున్న చోటే వర్షాలు కురుస్తాయి | Sakshi
Sakshi News home page

చెట్లున్న చోటే వర్షాలు కురుస్తాయి

Published Thu, Jul 21 2016 12:19 AM

చెట్లున్న చోటే వర్షాలు కురుస్తాయి

డిచ్‌పల్లి : మన దగ్గర తెప్పలు (మబ్బులు) పైనుంచి పోతున్నా.. వర్షాలు పడుతలేవు.. చెట్లున్న ప్రాంతాల్లోనే వర్షాలు బాగా కురుస్తున్నాయి.. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి, తిర్మన్‌పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి హరితహారం కార్యక్రమంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. కరువును, దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు పచ్చదనాన్ని పెంచడమే ఏకైక మార్గమని అన్నారు. ప్రజలందరూ ఉద్యమ స్ఫూర్తితో హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  

Advertisement
Advertisement