తాగునీటి కోసం గిరిజనుల ధర్నా | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం గిరిజనుల ధర్నా

Published Tue, Aug 23 2016 6:01 PM

తాగునీటి కోసం గిరిజనుల ధర్నా

బద్యాతండ(చివ్వెంల) : తాగునీటి కోసం మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసం బద్యాతండాలో  గిరిజనులు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ తండాకు తాగునీరు సరఫరా చేసే స్కీం బోరు మరమ్మతుకు గురై వారం రోజులు గడుస్తున్నా సర్పంచ్, కారద్యర్శి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  దీనితో గ్రామ శివారులోని వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని కోరారు. ఈకార్యక్రమంలో భానోతు ఈరోలి, నీలిమా, మంగ్లీ, జీజా, లక్ష్మీ, జ్యోతి, బద్రి, కవిత, బుజ్జి, లచ్చి, మంగమ్మ, పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement