ట్రాలీ ఆటో బోల్తా.. మహిళ మృతి | Sakshi
Sakshi News home page

ట్రాలీ ఆటో బోల్తా.. మహిళ మృతి

Published Sat, Aug 20 2016 11:47 PM

మృతిచెందిన గుగులోత్‌ అంకీ - Sakshi

  • ఇద్దరికి తీవ్ర గాయాలు
  • కోమాలోకి ఆటోడ్రైవర్‌
  • నలుగురు స్కూల్‌ పిల్లలకు స్వల్పగాయాలు
  • గార్ల: కోట్యాతండా సమీపంలో శనివారం ట్రాలీ ఆటో బోల్తా పడి మహిళ మతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోడ్రైవర్‌ కోమాలోకి పోగా నలుగురు స్కూల్‌ పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పోచారం పంచాయతీ కోట్యానాయక్‌తండాకు చెందిన మూడు ప్రవీణ్‌ ట్రాలీ ఆటోలో అదే గ్రామానికి చెందిన 15 మంది ప్రయాణిస్తున్నారు. గార్ల బయలుదేరిన ఆటోను డ్రైవర్‌ అతివేగంగా నడపడంతో తండా దాటిన తర్వాత మూలమలుపు వద్ద ట్రాలీ బోల్తా పడి చెట్టును ఢీకొంది. ఆటోలో ఉన్న గుగులోత్‌ అంకీ (45) అక్కడికక్కడే మతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు స్కూల్‌ పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వారిని 108 వాహనంలో గార్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆటోడ్రైవర్‌ మూడు ప్రవీణ్‌ కోమాలోకి వెళ్లగా మరోవ్యక్తి భూక్యా మంగీలాల్‌ తలకు తీవ్రగాయమైంది. వీరిద్దర్నీ మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలైన విద్యార్థులు శ్రీధర్, పవన్, పావని, వెన్నెల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్‌ అతి వేగంగా, అజాగ్రత్తగా ఆటోను నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆటోలో ప్రయాణిస్తున్న  వారు తెలిపారు. మతురాలికి ముగ్గురు సంతానం. మతురాలి భర్త గుగులోత్‌ శంకర్‌ ఫిర్యాదు మేరకు గార్ల ఎస్సై బి. రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement
Advertisement