టీఆర్‌ఎస్‌ పార్టీ.. రాబందులాంటిది | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పార్టీ.. రాబందులాంటిది

Published Sat, Jul 23 2016 11:56 PM

మాట్లాడుతున్న కూనంనేని సాంబశివరావు - Sakshi

  • సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
  •  
    మణుగూరు: టీఆర్‌ఎస్‌ పార్టీ.. రాబందులాంటిదని, మున్ముందు అది ప్రజాగ్రహం అనే ఒకే ఒక్క తుపానుతో కొట్టుకుపోతుందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం ఇక్కడ సీపీఐ శాఖ సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులను చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ను ప్రజలు చరిత్రలో కలిపే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే టీఆర్‌ఎస్‌కు కూడా పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నవారికి ఒరిగేదేమీ ఉండదని; కేవలం తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్‌ వంటి కొద్దిమందికే ప్రయోజనం ఉంటుందని అన్నారు. సీపీఐలో ఎదిగి అవకాశవాదంతో ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారు మాతృ ద్రోహుల్లాంటివారని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నాయకులు అయోధ్య చారి, సాబీర్‌పాషా, సరెడ్డి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement