తిరుమలలో ప్రయివేటు హోమం కలకలం | Sakshi
Sakshi News home page

తిరుమలలో ప్రయివేటు హోమం కలకలం

Published Wed, Mar 23 2016 9:19 AM

అతిథిగృహంలో నిర్వహిస్తున్న హోమం (ఇన్‌సెట్‌లో) బర్ఫానీ దాదాజీ

సాక్షి, తిరుమల: తిరుమలలోని టీటీడీ అతిథిగృహంలో మంగళవారం ప్రైవేట్ హోమం కలకలం రేపింది. స్థానిక శ్రీవారి కుటీర్ అతిథిగృహంలో మధ్యప్రదేశ్‌లోని బర్ఫానీ ఆశ్రమానికి చెందిన సుమారు 250 సంవత్సరాలు వయసు కలిగినట్టుగా ప్రచారంలో ఉన్న భర్ఫానీ దాదాజీతో పాటు ఆయన శిష్యగణం ఈ హోమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హోమ గుండం వద్ద సుమారు 250 తిరుమల శ్రీవారి లడ్డూలతోపాటు ఇతర పదార్థాలు పెట్టి హోమం, పూజలు చేశారు. సమాచారంతో టీటీడీ అధికారులు అక్కడికి చేరుకుని హోమాన్ని నిలిపివేయించారు. టీటీడీ అనుమతి లేకుండా అతిథిగృహాల్లో ప్రైవేట్ హోమాలు ఎలా చేస్తారు? అని నిర్వాహకులను ప్రశ్నించారు. లోకకల్యాణం కోసం ఇలాంటి పూజలు చేస్తున్నామని , తిరుమలలో ఇలాంటి పూజలు చేయకూడదన్న సమాచారం తెలియకపోవడం వల్లే చేశామని బర్ఫానీ దాదాజీతోపాటు ఆయన శిష్యగణం తెలిపింది.

Advertisement
Advertisement