జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పిడుగు పాటుకు మరొకరు మృత్యువాత పడ్డారు. లావేరు మండలం సుభద్రాపురం జంక్షన్ వద్ద జరిగిన ఓ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త శ్రీకాకుళంలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. మరో ప్రమాదంలో బస్సుకు విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై వృద్ధురాలు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే...
లావేరు : చావు పరామర్శకు Ðð ళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త తీవ్ర గాయాల పాలయ్యాడు. దీనికిS సంబంధించిన వివరాలు... మండలంలోని అప్పాపురం గ్రామానికి చెందిన యండ చినరాముడు, అతని భార్య యండ రాములమ్మ పొందూరు మండలంలోని బాణాం గ్రామానికి తమ బంధువు మృతి చెందడంతో పరామర్శకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. అనంతరం బుధవారం వేకువజామున బాణాంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరి అప్పాపురం గ్రామానికి వస్తుండగా మండలంలోని సుభద్రాపురం జంక్షన్ వద్ద విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ప్రైవేటు ట్రావల్ బస్సు వీరిని ఢీకొంది. దీంతో వాహనం పై నుంచి భార్య రాములమ్మ ఎగిరిపడడంతో తలకు బలమైన గాయమైంది. భర్త చినరాముడుకు కూడా తలకు బలమైన గాయాలయ్యాయి. వీరిని 108లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. రాములమ్మ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవల కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్కు వైద్యులు రిఫర్ చేశారు. కేజీహెచ్లో వైద్యులు రాములమ్మను పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందిందని గుర్తించారు. భర్త చినరాముడు శ్రీకాకుళంలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. లావేరు ఏఎస్ఐ కృష్ణారావు, పీసీ అప్పలనాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. అనంతరం కేజీహెచ్కు వెళ్లి రాములమ్మ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.