రెండు లారీలు ఢీ.. ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ.. ఇద్దరి మృతి

Published Sun, Aug 7 2016 2:02 PM

two died in lorrys colision in nellore

కొడవలూరు(నెల్లూరు): ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడంతో.. లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. గుడివాడకు చెందిన డ్రైవర్ బాబీతో పాటు పిడుగురాళ్లకు చెందిన క్లీనర్ శంకర్ మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

Advertisement
Advertisement