రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Thu, Dec 15 2016 12:16 AM

two died in road accident

- ఆగిన ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్కూటర్‌ 
 
ఆస్పరి: ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను స్కూటర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన  బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో శంకరబండ బస్టాప్‌ దగ్గర చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటరమణ చెప్పిన వివరాలు మేరకు.. ఆదోని పట్టణం ఇందిరానగర్‌కు చెందిన దుర్గప్ప (25), రామయ్య (30)లు పనిపై ఆస్పరికి వచ్చారు. వీరు తిరిగి ఆస్పరి నుంచి ఆదోనికి స్కూటర్‌పై వెళ్తూ... శంకర బండ బస్టాప్‌ దగ్గర  పంక్చర్‌ అయి ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల బంధవులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement