రెండు వాహనాల ఢీ : ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

రెండు వాహనాల ఢీ : ఇద్దరికి గాయాలు

Published Fri, Sep 2 2016 11:06 PM

two injured in auto and bolero accident

చిలమత్తూరు : మండలంలోని కోడూరు తోపులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఆటో, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక బాగేపల్లి నుంచి పుట్టపర్తి వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఇదే రోడ్డు మీద గోరంట్ల వైపు వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి ఢీకొంది.

దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న గుమ్మయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రప్ప, ముద్దప్పపల్లి గ్రామానికి చెందిన రామచంద్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement