లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి గాయాలు

Published Wed, Jun 1 2016 11:19 AM

Two injured in road accident

వేగంగా వెళ్తున్న డీసీఎం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వస్తున్న డీసీఎం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో.. డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. క్లీనర్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement