Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Published Mon, Sep 5 2016 12:30 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి - Sakshi

  • అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు
  • నుజ్జునుజ్జయిన ద్విచక్ర వాహనం
  • మృతులు ఖమ్మం జిల్లా బయ్యారం వాసులు
  • మహబూబాబాద్‌ రూరల్‌ : అతి వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్‌ పట్టణ శివార్లలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ నందిరాం కథ నం ప్రకారం ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా గొర్మిళ్లకు చెందిన బానోత్‌ సేట్‌రాం(47), ఓ మహిళతో టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌పై మానుకోట నుంచి గొర్మిళ్లకు వెళ్తున్నారు. ఈక్రమంలో గూడూరు నుంచి మానుకోటకు వస్తున్న కారు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘ  టనలో బానోత్‌ సేట్‌రాంతో పాటు మహిళ వాహనం పైనుంచి ఎగిరిపడ్డారు. ఈ మేరకు వారు అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నుజ్జునుజ్జయింది. కాగా, కారు వేగంగా వెళ్లి రాళ్లను ఢీకొట్టి ఆ గిపోవడంతో డ్రైవర్‌ పారిపోయాడు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ రాజమహేంద్రనాయక్, టౌన్, రూరల్‌ సీఐలు నందిరాంనాయక్, కృష్ణారెడ్డి, ఎస్సైలు తిరుపతి, జి తేందర్‌ పరిశీలించి మృతదేహాలను మార్చురీకి తరలించారు. కాగా, ఘటనలో సేట్‌రాంతో పాటు మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement