పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన టిప్పర్‌ | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన టిప్పర్‌

Published Sun, Feb 12 2017 10:58 AM

two killed in road accident

పెండ్లిమర్రి(వైఎస్సార్‌జిల్లా): వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పెళ్లి బృందంపైకి టిప్పర్‌ దూసుకెళ్లడంతో.. ఇద్దరు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

వేగంగా వెళ్తున్న టిప్పర్‌ అదుపుతప్పి పెళ్లి బృదం పైకి దూసుకెళ్లడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ గర్భిణి ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement