రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Fri, Aug 26 2016 8:20 AM

two people died in road accident

ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): ముత్తుకూరు మండలం మల్లూరు వద్ద శుక్రవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు దమ్మాయిపాలెంనకు చెందిన శ్రీహరి(35), శ్రీను(28)గా గుర్తించారు. బైక్‌పై ఇద్దరూ కృష్ణపట్నం పోర్టు నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement