ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్‌

Published Sun, Oct 9 2016 12:55 AM

ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్‌ - Sakshi

 
  •  రూ.40 వేల నగదు, 4 ఎర్రచందనం దుంగల స్వాధీనం 
కావలిరూరల్‌ : ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్న లారీని పట్టుకుని ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్‌ చేసినట్లు కావలి రూరల్‌ ఎస్సై జి.పుల్లారావు తెలిపారు. జాతీయ రహదారిపై గౌరవరం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా  ఓ లారీ పోలీసులను గమనించి వెనక్కి మళ్లీంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అనుమానించిన సిబ్బంది లారీని నిలిపి తనిఖీ చేశారు. ఖాళీ కూరగాయల ట్రేల మధ్యలో 4 ఎర్రచందనం దుంగలు ఉండటంతో మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ యజమాని ఇమ్రాన్‌మేవ్, లారీలో ఉన్న పొదలకూరుకు చెందిన వేమిరెడ్డి సురేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ మార్గంలో తనిఖీలు ఉండవని, ఉదయగిరి నుంచి కావలి మీదుగా నెల్లూరుకు వెళ్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా వీరిపై ఎర్రచందనం కేసులున్నట్లు తేలిందన్నారు. ఎర్రచందనం తరలింపులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో విచారిస్తున్నామన్నారు.   
 
 

Advertisement
Advertisement