ఇద్దరిని కాపాడి..మృత్యు ఒడికి.. | Sakshi
Sakshi News home page

ఇద్దరిని కాపాడి..మృత్యు ఒడికి..

Published Wed, Sep 9 2015 7:05 PM

two save before dies in merrigudem

జన్నారం (ఆదిలాబాద్): విద్యుత్ షాక్‌తో విలవిలలాడుతున్న ఇద్దరిని కాపాడి ఓ వ్యక్తి మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం మెర్రిగూడెంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. మెర్రిగూడెం గ్రామానికి చెందిన బాదావత్ సురేశ్ ఇంటికి జాడి శ్రీనివాస్ కూలీ డబ్బుల కోసం వెళ్లాడు. అదే సమయంలో సురేవ్ తన ఇంటి ముందు ఉన్న తీగలపై బట్టలు ఆరవేస్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.

సురేశ్ను రక్షించే ప్రయత్నంలో అతడి బంధువు బాదావత్ లక్ష్మి షాక్‌కు గురైంది. అక్కడే ఉన్న జాడి శ్రీనివాస్ (50) అప్రమత్తమై వారిని తీగ నుంచి లాగేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ పడిపోగా శ్రీనివాస్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. చుట్టుపక్కల వారు ముగ్గురినీ జన్నారంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడికి భార్య లింగవ్వ, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement