ఉగాండాలో దుండగుల కాల్పులు | Sakshi
Sakshi News home page

ఉగాండాలో దుండగుల కాల్పులు

Published Wed, Feb 22 2017 12:21 AM

ఉగాండాలో దుండగుల కాల్పులు - Sakshi

మైదుకూరు టౌన్‌ : ఉగాండా దేశంలో ఈనెల 17వతేదీ  రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మైదుకూరు వాసి షయద్‌ఫరూఖ్‌బాషా(24) మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సాయినాథపురంలో సయద్‌ ఫరూక్‌బాషా బోర్‌వెల్‌లో పనిచేస్తున్నాడు.  గత ఏడాది  ఉగాండాలో ఇంస్ట్రో బోర్‌వెల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఒప్పదం కుదర్చుకొని అక్కడికి వెళ్లాడు.  ఈనెల 17వ తేదీ రాత్రి విధులు ముగించుకొని వాహనంలో నివాసానికి వెళుతుండగా మార్గ మధ్యలో దుండగులు  కాల్పులు జరపడంతో సయద్‌ఫరూక్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతదేహం ఈనెల 24వ తేదీ స్వగ్రామంకు చేరుకోనున్నట్లు మృతుడి అన్న ఖలీల్‌బాషా తెలిపారు.
 

Advertisement
Advertisement