వెంకయ్య, చంద్రబాబు రాజకీయ శిఖండులు | Sakshi
Sakshi News home page

వెంకయ్య, చంద్రబాబు రాజకీయ శిఖండులు

Published Mon, Sep 19 2016 11:14 PM

సమావేశంలో మాట్లాడతున్న ఆర్‌ఆర్‌యస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి - Sakshi

 
తిరుపతి రూరల్‌: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యంధ్రాభివృద్ధికి అడ్డుపడుతున్న రాజకీయ శిఖండులని రాయలసీమ రాష్ట్ర సమితి(ఆర్‌ఆర్‌యస్‌) రాష్ట్ర అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హోదాకోసం పోటాపోటీగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ ప్రస్తుతం ప్యాకేజీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం దారుణమన్నారు. వెంకయ్య, చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం లేదని తెలిపారు. హోదా తీసుకురావడం చేతకాకపోతే వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సినిమాలో అతిథిపాత్రల తరహాలో అప్పుడప్పుడు రాజకీయ ఉపన్యాసాలు చేసే పవన్‌ కల్యాణ్‌ సినీ డైలాగులు మాని హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాలని సూచించారు. లేకుంటే చిరంజీవికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. నవ్యాంధ్రలో సీమకు తీరని అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్‌ఆర్‌ఎస్‌ నాయకులు నగేష్, కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement