ఘనంగా ముగిసిన త్యాగరాజ సంగీతోత్సవాలు
చివరి రోజు అలరించిన రతిప్రియ గాత్రకచేరి
వేంకటేశ నిను సేవింపగను పదివేల కనులు గావలనయ్య..
నాద లోలుడై బ్రహ్మానందవే మనసా..
తెరతీయగా రాదా..నాలోని తెరతీయగ రావా..
తిరుపతి వెంకటరమణ తెరతీయగ రాదా అంటూ
సంగీత విద్మన్మణి త్యాగరాజస్వామి సంకీర్తనలతో భక్తి ప్రవాహంలో ముంచెత్తిన సంగీత్సోవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. త్యాగరాజస్వామి భక్తి సంకీర్తనలపై చర్చావేదిక, సమావేశాలు, సదస్సుల ద్వారా భక్తి సంగీత విశిష్టతను చాటారు. ప్రముఖ సంగీత విద్వాంసులను సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డులతో ఘనంగా సత్కరించారు.
తిరుపతి కల్చరల్: త్యాగరాజస్వామి 250 జయంతి మహోత్సవాల్లో భాగంగా త్యాగరాజస్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి ప్రారంభమైన సంగీతోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. నగరంలోని త్యాగరాజ మండపంలో 11 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ సంగీత విద్యాంసులు పాల్గొని త్యాగరాజస్వామి సంకీర్తనలను ఆలపించారు. త్యాగరాజ భక్తి సంకీర్తనలపై చర్చావేదిక, త్యాగరాజ దిన చర్య, త్యాగరాజ శిష్య పరంపర సంకీర్తనల వ్యాప్తి వంటి సమావేశాలు, సదస్సుల ద్వారా త్యాగరాజ భక్తి సంగీత విశిష్టతను చాటారు. శాస్త్రీయ సంగీతం విస్తృతికి నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ సంగీత విద్యాంసులకు త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సప్తగిరి సంగీత విద్వన్మణి అవార్డులతో ఘనంగా సత్కరించారు. చివరిరోజు చెన్నైకి చెందిన రతిప్రియ గాత్ర కచ్చేరి శ్రోతులను భక్తి ప్రవహంలో ఓలలాడించింది. కేదారరాగంలో రామా నీపై తనకు ప్రేమ..., కానడ రాగంలో శ్రీనారద నాద సర నీరూపం.., మాళవి రాగంలో నెనరుంచినాను అన్నిటికీ.. వంటి త్యాగరాజ కృతులను సుమధురంగా గానం చేసి ప్రేక్షకులను మైమరిపించారు. వీరికి వయోలిన్పై ఆర్. రాహుల్, మృదంగంపై కుంభకోణం స్వామినాథన్ చక్కటి సహకారం అందించారు. ఇదే వేదికపై త్యాగరాజ ట్రస్ట్ మాజీ చైర్మన్ మాడభూషి కృష్ణస్వామి 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది. తర్వాత త్యాగరాజ జీవిత చరిత్రపై నేమాని నాగలక్ష్మి గానం చేసి హరికథ శ్రోతులను ఆకట్టుకుంది. త్యాగయ్య యోగ వైభవం, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను వివరించారు. వీరికి వయోలిన్పై రామగోపాల్, మృదంగంపై పి.మధు సహకరించారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ చక్కటి వ్యాఖ్యానం చేశారు. చివరిగా ఆంజనేయ ఉత్సవం ఘనంగా నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు వేణుగోపాల్రెడ్డి, దొరైరాజ్, సుందరరామిరెడ్డి, కత్తుల సుధాకర్ పాల్గొన్నారు.
వేంకటేశ నిను సేవింపగను..
Published Thu, Aug 4 2016 12:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement