ఉత్కఠభరితంగా జూబ్లీక్లబ్‌ ఎన్నికలు | Sakshi
Sakshi News home page

ఉత్కఠభరితంగా జూబ్లీక్లబ్‌ ఎన్నికలు

Published Sun, Sep 25 2016 11:13 PM

కర్నాటి వీరభద్రం    అతిమాముల జయప్రకాష్‌ - Sakshi

ఖమ్మం స్పోర్ట్స్: నగరంలో జూబ్లీ క్లబ్‌ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా కర్నాటి వీరభద్రం మరోసారి ఎన్నికయ్యారు.  కర్నాటి వీరభద్రానికి 921 ఓట్లు, సమీప ప్రత్యర్థి నున్ను సత్యనారాయణకు 766 ఓట్లు పోలయ్యాయి. వీరభద్రం 155 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  సంయుక్త కార్యదర్శిగా అతిమాముల జయప్రకాష్‌ 523 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 1104 ఓట్లు, సమీప ప్రత్యర్థి యర్రా అప్పారావుకు 581 ఓట్లు పోలయ్యాయి. ఏడుగురు కార్యవర్గ సభ్యుల ఎన్నికకు ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది.
 

Advertisement
Advertisement